సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రద్దు

-

తెలంగాణ కాంగ్రెస్  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. కానీ రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రద్దు అయింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాల నేపథ్యంలో.. అందులో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. అసెంబ్లీ సెషన్ నడుస్తుండటంతో.. గురువారం ఉదయం సభకు వచ్చిన సీఎం.. ఆ తరువాత మధ్యాహ్నం స్పెషల్ ఫ్లైట్ లో ఢిల్లీకి బయలుదేరి  వెళ్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

కానీ తాజాగా పర్యటన రద్దు అయింది. సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితుడిగా ఉన్న దామోదర రాజనర్సింహ, స్పెషల్ ఇన్వైటీ వంశీ చందర్ రెడ్డి కూడా సమావేశాలకు హాజరు కానున్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ ఆఫీస్ లో మధ్యాహ్నం 3 గంటలకు జరుగనున్న ఈ భేటీలో.. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఏపీ నుంచి రఘువీరారెడ్డి, పల్లం రాజు, కొప్పుల రాజు, సుబ్బరామిరెడ్డి పాల్గొననున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version