గ్రూపు 2 పరీక్ష పై సీఎం రేవంత్ కీలక నిర్ణయం..!

-

తెలంగాణలో గ్రూప్-2 పరీక్ష ఎప్పుడు, ఎలా అనే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ పై సమీక్ష జరిపిన ఆయన.. త్వరలోనే గ్రూప్ -2 పరీక్షను రీ-షెడ్యూల్ చెయ్యాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఐతే.. ఇప్పటికే ఈ పరీక్ష 2సార్లు వాయిదా పడింది. చివరకు వచ్చే ఏడాది జనవరిలో జరగనుంది. దీని కింద మొత్తం 783 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి కోసం మొత్తం 5.51 లక్షల మంది అప్లై చేసుకున్నారు. ఐతే.. జనవరిలో ఈ పరీక్ష తప్పనిసరిగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

గ్రూప్ -2తోపాటూ TSPSCలో ఇతర పరీక్షలను కూడా రీషెడ్యూల్ చేయాలని  సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలిసింది. ఈ అంశంపై నిన్న, ఇవాళ కూడా ఆయన సమీక్ష జరిపారు. పరీక్షల నిర్వహణ, రీషెడ్యూల్‌పై లోతుగా చర్చిస్తున్నారు. ఇప్పటివరకూ వచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షలన్నీ రీషెడ్యూల్ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. అలాగే ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా జాబ్ క్యాలెండర్ ప్రకారం రిక్రూట్‌మెంట్ చేయనున్నట్టు సమాచారం. 

Read more RELATED
Recommended to you

Exit mobile version