సాయిచంద్ కుటుంబానికి పరామర్శ.. కన్నీరు పెట్టుకున్న ఎమ్మెల్సీ కవిత

-

ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, ప్రముఖ గాయకుడు సాయిచంద్ కుటుంబ సభ్యులను పరామర్శించారు సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. సాయిచంద్ నివాసానికి వెళ్లగానే ఎమ్మెల్సీ కవితను చూసి సాయిచంద్ భార్య బోరున విలపించింది. వారిని ఓదార్చే క్రమంలో కవిత సైతం భాగోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకుంది.

చిన్న వయసులోనే సాయిచంద్ మరణించడం బాధాకరం అని అన్నారు ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ ఉద్యమ సమయంలో తన పాటలతో ఎంతోమందిని చైతన్యవంతం చేశారని పేర్కొంది. మా అందరికీ ఆత్మీయుడు చనిపోయాడని వార్త జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. సాయిచంద్ మరణం తీరని లోటు అని తెలిపారు ఎమ్మెల్సీ కవిత. ఆయన కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news