కేసీఆర్ కుటుంబాన్ని వదిలేది లేదు – ఈటెల రాజేందర్

-

వరంగల్: ఈనెల 8వ తేదీన ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనపై బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ స్పందించారు. బిజెపి శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు ప్రధాని మోదీ వరంగల్ కి వస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని వ్యాగన్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు భూమి పూజ చేస్తారని తెలిపారు. ఇక కెసిఆర్ కుటుంబ పాలనను వదిలేది లేదని.. చట్టం నుంచి ఎవరూ తప్పించుకోవాలని అన్నారు ఈటెల.

మొదటి సారి ప్రధాని వస్తున్న సందర్భంలో ఘనస్వాగతం పలకాలని ప్రజలను కోరుతున్నానన్నారు. బీజేపీకి బలమైన కేంద్రంగా వరంగల్ జిల్లా ఉందన్నారు. బీజేపీ శ్రేణులు మొత్తం ప్రధాని సభ పోల్ విజయం కోసం పనిచేస్తున్నామన్నారు. బీజేపీ పై విషం కక్కే ప్రయత్నం చేస్తున్నారని.. కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని ఆరోపించారు. మేము తక్కువ మాట్లాడి, ఎక్కువ పని చేస్తామన్నారు ఈటెల. తెలంగాణ గడ్డ మీద 2019 నుండి బీజేపీ విజయ పరంపర మొదలైందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news