కాంగ్రెస్ – బీజేపీ వాళ్ళను చీపుర్లతో కొట్టాలి – మంత్రి మల్లారెడ్డి

-

కాంగ్రెస్ – బిజెపి పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు మంత్రి మల్లారెడ్డి. నేడు నిజామాబాద్ జిల్లాలోని మాక్లూర్ లో జరిగిన బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. కర్ణాటక ఎన్నికలతో బిజెపి పని అయిపోయిందని అన్నారు. నిజామాబాద్ లో బిజెపిని గెలిపిస్తే పసుపు బోర్డు రాలేదని విమర్శించారు. బిజెపి పాలిత రాష్ట్రాలలో తెలంగాణ మోడల్ గా నిలుస్తోందని.. కాంగ్రెస్ పాలనలో ఇలాంటి పథకాలు ఉన్నాయా..? అని ప్రశ్నించారు.

ఏ ముఖం పెట్టుకొని వాళ్ళు ఓట్లు అడుగుతారని మండిపడ్డారు మల్లారెడ్డి. నిజామాబాద్ లో ధర్మపురి అరవింద్ ఎంపీ ఎలా అయ్యాడో.. మా దగ్గర రేవంత్ రెడ్డి కూడా అలానే ఎంపీ అయ్యాడని ఎద్దేవా చేశారు. మీరు ఏ ముఖం పెట్టుకొని అధికారంలోకి వస్తారు..? రోడ్లమీద తిరుగుతూ రేవంత్ రెడ్డి అధికారంలోకి వస్తా అంటున్నాడని విమర్శించారు. కాంగ్రెస్ – బిజెపి వాళ్లు ఓట్లు అడిగితే చీపుర్లతో కొట్టాలని సంచలన వ్యాఖ్యలు చేశారు మల్లారెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news