ఎట్టి పరిస్థితుల్లో మల్కాజ్ గిరిలో కాంగ్రెస్ జెండా ఎగురలిందే : సీఎం రేవంత్ రెడ్డి

-

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైన విడుదల చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో మే 13న ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ 4 పార్లమెంట్ స్థానాలను ప్రకటించింది. మిగతా స్థానాలను త్వరలోనే ప్రకటించనుంది.

ఈ నేపథ్యంలో తాజాగా సీఎం రేవంత్ రెడ్డి మల్కాజ్ గిరి నియోజకవర్గం నేతలతో సమీక్ష నిర్వహించారు. మల్కాజ్ గిరి అభ్యర్థి ఎంపిక పై చర్చించారు. ఈ ఎన్నికల్లో వికారాబాద్ జడ్పీ చైర్ పర్సన్ పట్నం సునితారెడ్డి హాజరయ్యారు. దీంతో ఆమెను బరిలో నిలుపుతారంటూ జరుగుతున్న ప్రచారానికి బలం చేకూరుతోంది.  ఈ సందర్భంగా  మల్కాజ్ గిరి లో ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్ జెండా ఎగురాల్సిందేనని ముఖ్యనేతలకు  సూచించారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్ గిరి ఎంపీగా సీఎం రేవంత్ రెడ్డి విజయం సాధించిన విషయం తెలిసిందే. అందుకే గతంలో గెలిచినటువంటి పార్లమెంట్ స్థానాన్ని మరోసారి గెలుచుకోవాలని ప్రెస్టేషన్ లో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news