నేడు హైదరాబాద్‌కు రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే

-

రాష్ట్ర కాంగ్రెస్‌ నేతల మధ్య నెలకొన్న విభేధాలు తొలగించి అందరినీ ఒకే తాటిపైకి తీసుకురావడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్‌రావ్‌ ఠాక్రే నేడు హైదరాబాద్‌ రానున్నారు. ఇంఛార్జ్ హోదాలో తొలిసారి వస్తున్న ఠాక్రేకు విమానాశ్రయంలో ఘనస్వాగతం పలకనున్న కాంగ్రెస్‌ నేతలు గాంధీభవన్‌ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. ఉదయం పదిన్నరకు గాంధీభవన్‌ చేరుకోనున్న ఠాక్రే నేడు, రేపు రాష్ట్ర నాయకులతో చర్చలు జరపనున్నారు.

తొలుత ఏఐసీసీ కార్యదర్శులతో ఆతర్వాత పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో.. తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ పరిస్థితి సహా ఇతర అంశాలపై చర్చిస్తారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. సీనియర్ నేతలు, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు, రాజకీయ వ్యవహారాల కమిటీతో చర్చలు జరపనున్నారు. రేపు జిల్లాకాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, పార్టీ అనుబంధసంఘాలతో.. మాణిక్‌ రావు ఠాక్రే సమావేశం కానున్నారు. అసంతృప్తులను బుజ్జగించడం, నేతల మధ్య సఖ్యత తీసుకురావడం సహా అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలకు పదునుపెట్టేలా సూచనలు చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version