తెలంగాణ ఉద్యమానికి చార్మినార్, కాకతీయ తోరణాలకు ఎలాంటి సంబంధమే లేదు !

-

తెలంగాణ ఉద్యమానికి చార్మినార్, కాకతీయ తోరణాలకు ఎలాంటి సంబంధమే లేదని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ కాంగ్రెస్ భవన్ లో రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించి ఈ కామెంట్స్ చేశారు. చార్మినార్, కాకతీయ తోరణాలు తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన చిహ్నాలు కావన్నారు.

Congress MLA Bhupathi Reddy made sensational comments

కాకతీయ కళా తోరణం ,చార్మినార్ లు రాచరిక పాలనకు నిదర్శనమంటూ ఫైర్‌ అయ్యారు. అందుకే వాటి స్థానంలో కొత్త రాజముద్ర ను తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మేధావులతో చర్చలు జరుపుతున్నమని… రాజముద్ర పై బి ఆర్ ఎస్ పార్టీ ఆందోళన చేయడం సిగ్గుచేటు అంటూ నిప్పులు చెరిగారు. ఈసారి జరిగే రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ప్రజలంతా సంతోషంగా పాల్గొంటారు….పదేళ్లపాటు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అరాచకాలకు తెలంగాణ ప్రజలే చమర గీతం పాడారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news