ప్రజలకు కాంగ్రెస్ అండగా ఉంటుంది – మాణిక్ రావు ఠాక్రే

-

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇప్పుడు ఇస్తున్న ప్రతి ఒక్క హామీని నెరవేర్చుతుందని అన్నారు ఆ పార్టీ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే. గురువారం చేవెళ్ల సభాస్థలిని పరిశీలించిన అనంతరం మాణిక్ రావు ఠాక్రే మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 26న కొండా విశ్వేశ్వర్ రెడ్డి గ్రౌండ్ లో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ బహిరంగ సభ జరగబోతుందని తెలిపారు.

ఈ సభకి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరు కాబోతున్నట్లు తెలిపారు. ఇక కెసిఆర్ కుటుంబం అవినీతితో నిండిపోయిందని, ఆయన కూతురు కవిత లిక్కర్ స్కామ్ లో ఉందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్ మాదిరిగానే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేయడానికి మల్లికార్జున ఖర్గే ఈనెల 26వ తేదీన వస్తున్నట్లు తెలిపారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ, బీసీలను ఎందుకు తక్కువగా చూస్తుందని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news