ఇస్రో సైంటిస్టులకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సన్మానం

-

చంద్రయాన్ – 3 సేఫ్ లాండింగ్ విజయవంతంగా పూర్తి కావడంతో కర్ణాటక సీఎం సిద్దరామయ్య గురువారం ఇస్రో చీఫ్ సోమనాథన్ ను సన్మానించారు. బెంగళూరులోని ఇస్రో కేంద్రాన్ని సందర్శించిన సిద్ధరామయ్య.. సోమనాథ్ కి శాలువా కప్పి సత్కరించారు. చంద్రయాన్ 3 విజయవంతం కావడంలో కీలకపాత్ర పోషించిన ప్రాజెక్టు శాస్త్రవేత్తలను, సిబ్బందిని సిద్ధరామయ్య అభినందించారు. వారికి మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం సిద్ధరామయ్య మాట్లాడుతూ.. జాబిల్లిపై కాలు మోపడం చిన్న విషయం కాదని, అది అసాధారణ విజయమని అన్నారు. 500 మంది శాస్త్రవేత్తలు దీనిపై పనిచేశారని చెప్పారు. బెంగళూరు లోని విధాన సౌధలో ఇస్రో చైర్మన్ తో సహా శాస్త్రవేత్తలు అందరినీ సన్మానిస్తామని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news