రేవంత్ రెడ్డి పర్యటనలో మీడియాపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి

-

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఉప్పల్ పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా మేడ్చల్ జిల్లా ఉప్పల్ లో కాంగ్రెస్ నాయకుల మధ్య ఫ్లెక్సీ వార్ నెలకొంది. ఉప్పల్ ఏషియన్ థియేటర్ వద్ద పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు కాంగ్రెస్ అభ్యర్థులు. దీంతో కాంగ్రెస్ నాయకులు లక్ష్మారెడ్డి, పరమేశ్వర్ రెడ్డి అనుచరులు పరస్పరం ఘర్షణకు దిగారు.

లక్ష్మారెడ్డి పోస్టర్లను పరమేశ్వర్ రెడ్డి అనుచరులు చించివేయడంతో ఘర్షణ చోటు చేసుకుంది. ఫ్లెక్సీలు చించుతుండగా వీడియోలు తీసిన మీడియా రిపోర్టర్ల పై దాడికి తెగబడ్డారు పరమేశ్వర్ రెడ్డి అనుచరులు. వెంటపడి మీడియా ప్రతినిధులపై దాడికి దిగారు. పోలీసుల ముందే మీడియా ప్రతినిధులపై దాడి చేస్తుండగా.. అడ్డుకోబోయిన పోలీసులు కూడా కింద పడిపోయారు. దీంతో రేవంత్ రెడ్డి ప్రోగ్రాం ని బాయికాట్ చేశారు మీడియా ప్రతినిధులు.

Read more RELATED
Recommended to you

Latest news