“కరప్ట్ వర్కింగ్ కమిటీ” అంటూ హైదరాబాద్ లో వెలసిన పోస్టర్ లు !

-

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలకు మళ్లీ హైదరాబాద్ వేదికగా మారింది. నగరంలో నేటి నుంచి రెండు రోజులపాటు కాంగ్రెస్‌ పార్టీ అత్యున్నత విధాన నిర్ణయ కమిటీ సమావేశాలు జరగనున్నాయి. సీడబ్ల్యూసీ భేటీకి హాజరయ్యేందుకు కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా గాంధీ, మల్లిఖార్జున ఖర్గే నగరానికి ఈరోజు తరలిరానున్నారు.

హైదరాబాద్ లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాల నేపథ్యంలో పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. “కరప్ట్ వర్కింగ్ కమిటీ” అంటూ హైదరాబాద్ లో పోస్టర్ లు వెలశాయి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సభ్యుల ఫొటోలు, వారు చేసిన స్కాముల వివరాలతో పోస్టర్ లు కలకలం రేపుతున్నాయి. హోర్డింగ్ లో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా మొత్తం 24 మంది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుల ఫొటోలు, వారి స్కాముల వివరాలతో పోస్టర్లు వెలిశాయి. బివేర్ ఆఫ్ స్కామర్స్ (స్కాములు చేసే వాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండండి) అంటూ టాగ్ లైన్ తో వెలిశాయి పోస్టర్లులు.

Read more RELATED
Recommended to you

Latest news