హైదరాబాద్ లో నిరుద్యోగులకు, ఉద్యోగులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సీపీ…!

-

లక్నో కేంద్రంగా జాబ్ ఫ్రాడ్ మోసాలకు పాల్పడుతున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసారు. నౌకరీ లో అప్లోడ్ చేసిన రెజ్యూమ్ లను తీసుకొని మోసాలకు పాల్పడుతున్న ముఠాను అదుపులోకి తీసుకున్నామని సీపీ సజ్జనార్ వివరించారు. కెరీర్ స్టైల్ పేరుతో నకిలీ వెబ్ సైట్ క్రియేట్ చేసి మోసాలకు పాల్పడుతున్నారని ఆయన చెప్పారు. నౌకరీ వెబ్ సైట్ లో నుండి హైదరాబాద్ కి చెందిన యువత కి గాలం వేస్తున్నరన్నారు.

డేలాయిట్ లో పని చేసిన ఒక ఉద్యోగి కి మంచి జాబ్ అంటూ ఫోన్ కాల్ వచ్చింది. ఫేక్ లెటర్ , ఫేక్ ఇంటర్వ్యూ లు చేసి రిజిస్ట్రేషన్ ఫీ అంటూ బాధితులకు తొకరా పెట్టారని ఆయన పేర్కొన్నారు. బాధితులకు కాల్స్ చేయడానికి టెలి కాలర్స్ ను నియమించుకున్నారు. రెండు నెలల్లో ముఠా కు 38 లక్షలు చెల్లించింది ఒక బాధితురాలు. షాను అన్సారీ, యుగంటర్ శ్రీవాస్త, తుషార్ శ్రీవాస్త లను అరెస్ట్ చేసారు క్రైం పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news