Telangana : మరో ఇద్దరు అభ్యర్థులను ప్రకటించిన CPM

-

Telangana : అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై CPM మరో కీలక ప్రకటన చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిపిఎం మరో రెండు చోట్ల అభ్యర్థులను ప్రకటించింది. హుజూర్ నగర్ లో మల్లు లక్ష్మి, నల్గొండలో ముదిరెడ్డి సుధాకర్ రెడ్డిని బరిలో నిలిపింది. మొత్తం 17 చోట్ల పోటీ చేస్తామని ప్రకటించిన ఆ పార్టీ…. ఇటీవల 14 మందితో తొలి జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే.

CPM announced two more candidates

దీంతో ఇప్పటివరకు 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా….. మరో నియోజకవర్గంలో అభ్యర్థిని ఖరారు చేయాల్సి ఉంది. వాస్తవానికి 14 మంది అభ్యర్థులతో జాబితాలో చోటు కల్పిస్తూ…సిపిఎం తొలి జాబితా విడుదల చేసింది. పాలేరులో తమ్మినేని వీరభద్రం, మిర్యాలగూడలో జూలకంటి రంగారెడ్డి బరిలో ఉండనున్నారు. అంతేకాదు.. సీపీఐ పార్టీ చేయబోతున్న కొత్త గూడెం నియోజక వర్గంలో సీపీఎం పార్టీ పోటీ చేయడం లేదు. అలాగే.. బీజేపీ పార్టీని ఓడించే పార్టీకి తాము ఓట్లు వేస్తామని వెల్లడించింది సీపీఎం పార్టీ.

Read more RELATED
Recommended to you

Latest news