తెలంగాణలో ఆ మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్

-

మిగ్​జాం తుపాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ మహానగరంలో చిరుజల్లులు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా జల్లులు కురవడంతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో జీహెచ్​ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. వర్షాల వల్ల ఎలాంటి ప్రమాదం జరగకుండా చర్యలు చేపడుతున్నారు.

మరోవైపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలు బయట అడుగు పెట్టాలంటే జంకుతున్నారు. మరో రెండ్రోజులు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. ముఖ్యంగా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ మూడు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు. ఇంకోవైపు మహబూబాబాద్‌, వరంగల్‌ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ ఇచ్చారు. కరీంనగర్‌, పెద్దపల్లి, నల్గొండ, యాదాద్రి, జయశంకర్‌ భూపాలపల్లి, సిద్దిపేట, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, హైదరాబాద్‌, మేడ్చల్‌ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను ప్రకటించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని.. వర్షం కురిసే సమయంలో బయటకు రాకూడదని అధికారులు సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news