తెలంగాణలో డ్రగ్స్‌ ముఠాను అంతం చేస్తాం – మంత్రి దామోదర్ రాజనర్సింహ

-

తెలంగాణలో డ్రగ్స్‌ ముఠాను అంతం చేస్తామన్నారు మంత్రి దామోదర్ రాజనర్సింహ. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాదులోని తన క్యాంపు కార్యాలయంలో జూన్ 22 – 23 తేదీలలో నిజామాబాద్ పట్టణంలో ‘ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ తెలంగాణ స్టేట్ బ్రాంచ్ ‘ ఆధ్వర్యంలో “అడిక్షన్ సైకియాట్రీ” పై జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న సదస్సు పై రూపొందించిన బ్రోచర్ ను ఆవిష్కరించారు.

Statement of Minister Damodara Rajanarsimha key statement on Dharani Portal

ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ… డ్రగ్స్ మహమ్మారి నిర్మూలనపై యువతలో సామాజిక చైతన్యం, అవగాహన కల్పించడానికి నిజామాబాద్ లో ‘ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ తెలంగాణ స్టేట్ చాప్టర్’ ఆధ్వర్యంలో “అడిక్షన్ సైకియాట్రి” పై నిర్వహిస్తున్న జాతీయ స్థాయి సదస్సు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. సదస్సును నిర్వహిస్తున్న నిర్వాహకులను మంత్రి ఈ సందర్భంగా అభినందించారు.

Read more RELATED
Recommended to you

Latest news