కాంగ్రెస్ అధిష్టానానికి దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ

-

టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పై మండిపడుతూ కాంగ్రెస్ అధిష్టానానికి బహిరంగ లేఖ రాశారు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్. ట్రాన్స్ జెండర్లను అవమానపరిస్తూ మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి ఓ నీచుడు అంటూ తీవ్ర విమర్శలు చేశారు. రైతులకు మూడు గంటల కరెంటు చాలని అవమానించడం, రాష్ట్ర ప్రజలను కించపరిచేలా కులాల పేరుతో దూషిస్తున్న రేవంత్ రెడ్డి అహంకారం పై కాంగ్రెస్ అధిష్టానానికి లేఖ రాశారు.

యాదవులను పేడ విసుక్కుంటారనీ కించపరచడం, వంశ రాజులను హేళన చేయడం, మిగతా కులాలను చులకన చేయడం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిందన్నారు. ఇలాంటి బాధ్యతారాహిత్యమైన రాజకీయ నాయకుడిని సంఘం నుండి బహిష్కరించాలన్నారు. అగ్ర కులస్తుడనే పొగరుతో బీసీ కులస్తులను అవమానపరిస్తున్న రేవంత్ రెడ్డి ఓ దుష్టుడు, చరిత్ర హీనుడని తీవ్ర విమర్శలు చేశారు దాసోజు శ్రవణ్.

Read more RELATED
Recommended to you

Latest news