ఖమ్మంలో వైద్య విద్యార్థిని ఆత్మహత్య

-

ఖమ్మంలో ఆదివారం సాయంత్రం దంత వైద్య విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఓ ప్రైవేటు హాస్టల్లోని గదిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మానస మృతదేహాన్ని మార్చురీకి తరలించి ఆమె కుటుంబానికి సమాచారం అందించారు.

అసలేం జరిగిందంటే.. వరంగల్‌లోని పోచమ్మ మైదాన్‌ ప్రాంతానికి చెందిన సముద్రాల మానస (22) ఖమ్మంలోని ఓ కళాశాలలో బీడీఎస్‌ చివరి సంవత్సరం చదువుతోంది. మానస.. ఓ ప్రైవేట్ హాస్టల్​లోని ఓ గదిలో ఒంటరిగా ఉంటోంది. ఆదివారం సాయంత్రం ఆ గది నుంచి కాలిపోయిన వాసన వస్తుండటంతో నిర్వాహకులు, ఇతర విద్యార్థినులు వచ్చి చూశారు. ఆమె గది నుంచి పొగలు వస్తుండటంతో తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లారు. అప్పటికే మంటల్లో కాలిపోతున్న మానసపై నీళ్లు పోసి కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. పోలీసులు సంఘటనస్థలానికి వెళ్లి.. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.

హాస్టల్‌ సమీపంలోని ఓ బంకు నుంచి ఆమె పెట్రోలు కొని తీసుకువెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డవడంతో పోలీసులు వాటిని పరిశీలిస్తున్నారు. ఇటీవలే తండ్రి మృతి చెందడంతో మనస్తాపం చెందిన మానస.. తరచూ ఆయనను తలచుకుని బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటనపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఖానాపురం సీఐ శ్రీహరి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news