భూమిలేని రైతు కూలీలకు 12 వేలు : భట్టి

-

చింతకాని మండలంలో పర్యటన సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. మండల దళితబంధు లబ్ధిదారులకు నాగులవంచలో రెండోవిడుత యూనిట్ల మంజూరు పత్రాలను అందజేశారు భట్టి విక్రమార్క. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజల చేత.. ప్రజలఅవసరాలకోసం ఏర్పడినదే ఈ ప్రజాపాలన ప్రభుత్వం. భారత రాజ్యాంగం మేరకు ప్రజాపాలన కొనసాగుతుంది ప్రజాస్వామ్యని గౌరవించ్ఛే ప్రతి ఒక్కరు ఈ ప్రజాపాలనను స్వాగతించాలి. గత ప్రభుత్వ పాలనలో ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నమై ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పాలనానుండి విముక్తి కల్పించాం అని అన్నారు.

ఇక ప్రజా పాలనలో అన్ని వ్యవస్థలను గాడిలో పెడుతూ ముందుకు పోతున్నాం. రైతులకు పంట,వ్యక్తి ఇన్సూరెన్స్ తో పాటుగా సోలార్ పంపు సెట్లతో తో ఆదాయం వచ్చేలే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. భూమిలేని రైతు కూలీలకు సంవత్సరానికి 12 వేలు చొప్పున ఇచ్చే ఆలోచన ప్రభుత్వం చేస్తుంది అని పేర్కొన్నారు. ఐకేపీ మహిళలు ద్వారా ఆర్గానిక్ ఫార్మిగ్ ఏర్పాటు చేసి రసాయనం లేని వ్యవసాయం చేసేలా కృషి చేస్తున్నాం. ప్రజాసంక్షేమం కోసమే మా పాలన పనిచేస్తుంది. పక్కదారి పట్టిన దళిత బందు యూనిట్లు తిరిగి తెచ్చే బాధ్యత అధికారులదే అని భట్టి విక్రమార్క స్పష్టం చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version