తెలంగాణ ఎన్నికల కమిషనర్ గా రిటైర్డ్ ఐఏఎస్

-

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ రాణి కుముదిని నియమితులయ్యారు. ప్రస్తుత ఎన్నికల కమిషనర్ పార్థసారధి పదవీకాలం ఈనెల 8న ముగిసింది. దాంతో ఆయన స్థానంలో రాణి కుముదినిని ప్రభుత్వం నియమించింది. 1988 బ్యాచ్ కి చెందిన కుమిదిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో వివిధ హోదాలలో బాధ్యతలు నిర్వహించారు.

కేంద్ర సర్వీసులు అనంతరం తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు చేపట్టారు. 2023 ఎన్నికలకు ముందు పదవి విరమణ చేశారు. నాటి కెసిఆర్ ప్రభుత్వం ఆమెని తిరిగి అదే హోదాలో కొనసాగించింది. ఎస్ఇసి గా పార్థసారథి పదవీకాలం ఈనెల 8వ తేదీతో ముగియడంతో కాంగ్రెస్ ప్రభుత్వం రాణి కుముదినిని ఎస్ఇసి గా నియమించింది.

ఈ మేరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె మూడేళ్ల పాటు ఎస్సీసీగా కొనసాగుతారని ఉత్తర్వులలో పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కొత్త ఎస్ఈసి నియామకానికి ప్రాధాన్యం ఏర్పడింది. అలాగే రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్ గా రిటైర్డ్ ఐఏఎస్ ఎంజి గోపాల్ ని ప్రభుత్వం నియమించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version