మల్లన్న క్షేత్రానికి పోటెత్తిన భక్త జనం

-

ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం సోమవారం భక్తులతో కిటకిటలాడింది. స్వామి వారిని దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి సుమారు 20వేల మందికి పైగా భక్తులు కొమురవెల్లికి తరలివచ్చినట్లు ఆలయవర్గాలు తెలిపాయి. కొత్త సంవత్సరం మొదటి రోజు కావడంతో సైతం చేర్యాల, సిద్దిపేట, హుస్నాబాద్‌, గజ్వేల్‌, జనగామ, బచ్చన్నపేట, కరీంనగర్‌ తదితర  ప్రాంతాల నుంచి భక్తులు వచ్చారు.

కాగా.. ప్రతి ఏటా మొక్కులు చెల్లించుకునే భక్తులు భక్తులు శనివారం ఉదయం నుంచే మల్లన్న క్షేత్రానికి చేరుకున్నారు. అనంతరం ఆలయ నిర్వహణలో ఉన్న గదులతో పాటు ప్రైవేటుగా ఉన్న గదులు రెంట్‌కు తీసుకుని బస చేశారు. ఆదివారం వేకువజామునే నిద్రలేచి కోనేటిలో పవిత్ర స్నానం అచరించి, నేరుగా స్వామి వారి దర్శనం కోసం క్యూలైన్లలో గంటల పాటు వేచి ఉండి స్వామి వారిని దర్శించుకుని కోరికలు తీర్చాలని వేడుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version