ధర్మపురి అరవింద్ ఇంట్లోనే మూడు పార్టీలు ఉన్నాయి: ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

-

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు. స్పైస్ బోర్డు కు రూ. 6 కోట్లు నిధులు తెచ్చారని అరవింద్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఆయన తెచ్చిన నిధులు కేవలం రూ. 2 కోట్లకు మించలేదన్నారు. నిజామాబాద్ ఎంపీగా కవిత జిల్లాకు ఎన్నో కోట్ల నిధులు తెచ్చి అభివృద్ధి పనులు చేపట్టారని గుర్తు చేశారు. అరవింద్ ఎంపీగా గెలిచి మూడేళ్లు అవుతున్నప్పటికీ ఇప్పటివరకూ జిల్లాకు నిధులు తెచ్చింది ఏమీ లేదన్నారు.

టిఆర్ఎస్ఎల్పి లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎంపీ అరవింద్ ఓ అపరిచితుడి మాదిరిగా, అరాచకం సృష్టించే వాడిగా తయారయ్యాడని మండిపడ్డారు. పసుపు బోర్డు పై మాట తప్పిన అరవింద్ ను జీవితాంతం బాండ్ పేపర్లు వెంటాడుతూనే ఉంటాయి అన్నారు. అవినీతి డబ్బులతోనే అరవింద్ పెద్దగా అయ్యాడు అన్నారు. అరవింద్ ఇంట్లోనే మూడు పార్టీలు ఉన్నాయి.. ముందు ఇంట గెలిచి రచ్చ గెలవాలని ఎద్దేవా చేశారు జీవన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news