యువత లవ్ అఫైర్స్ మానుకోవాలని, కావాలంటే కొట్లాడి పెళ్లి చేసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంతరావు సూచించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. పూర్వం భార్యలు భర్తలను కాపాడండి అని దేవేళ్లను వేడుకునే వారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు భార్యలే భర్తలను చంపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నెంబర్ వన్ సిటీ కావాలంటే.. ఇలాంటి చెడు సంప్రదాయం దూరం చేయాలన్నారు. భార్యభర్తలు కలిసి జీవించాలని.. భార్యలు భర్త పై ప్రేమ చూపించాలని.. అలాగే పిల్లలు తల్లిదండ్రులపై ప్రేమ చూపించాలని అప్పుడే ఫ్యామిలీ బాగుంటుందని తెలిపారు.
సత్య హరిశ్చంద్రుడి ప్రాణాల కోసం భార్య యముడితో కొట్లాడింది. ఇప్పుడు భార్యలే భర్తల ప్రాణాలు తీస్తున్నారు. భార్యభర్తలు కలిసి ఉన్నప్పుడే సంసారం బాగుంటుందని పేర్కొన్నారు. భార్యలే భర్తలకు స్కెచ్ వేయడం నేనెప్పుడు చూడలేదన్నారు. తల్లులే భర్తలను చంపేస్తుంటే.. పిల్లల భవిష్యత్ ఏం కావాలి అని ప్రశ్నించారు. ప్రేమిస్తే.. పెల్లి చేసుకోండి.. కానీ ప్రేమ కోసం తల్లిదండ్రులను చంపవద్దని సూచించారు. హైటెక్ సిటీలో ఏదైతే జరుగుతుందో దానిపై మంత్రి శ్రీధర్ బాబు తాను లేఖ రాస్తానని వెల్లడించారు వీ.హెచ్.