బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ ని ఎందుకు కలిశారో తెలియదు : జగ్గారెడ్డి

-

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ ని ఎందుకు కలిశారో తెలియదు అని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో సీఎంని ఎమ్మెల్యేలు కలవాలని అనుకుంటే అది కుదిరేది కాదు. తొమ్మిదేండ్లలో దక్కని అవకాశం.. సీఎం రేవంత్ రెడ్డి రెండు నెలల్లోనే కల్పించారు. రేవంత్ పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. తొమ్మిదేండ్లలో మీ తప్పులను కప్పి పుచ్చుకునేందుకే ఆరోపణలు చేశారు. గతం గురించి కేటీఆర్ మాట్లాడితే.. మీ గతం గురించి మాట్లాడాల్సి వస్తోంది చూసుకో.

కేటీఆర్.. పద్దతి కాదు. కేటీఆర్ తండ్రి.. కేసీఆర్ యూత్ కాంగ్రెస్ నాయకుడిగా పని చేశారు. మీ నాయనా ఎక్క పని చేయకుండా ఉంటే.. రేవంత్ గురించి మాట్లాడితే బాగుంటుంది. మీ నాయనా డైరెక్టర్ బీఆర్ఎస్ తోనే రాజకీయాలు చేశాడా..? రేవంత్ గురించి మాట్లాడే అర్హత మీకు ఎక్కడిది.. బీఆర్ఎస్ చంపిన ప్రజాస్వామ్యంని కాంగ్రెస్ బతికించింది. ప్రతిపక్ష సభ్యుల గొంతు బీఆర్ఎస్ నొక్కింది. మేము ప్రజాస్వామ్యం ఇస్తున్నాం. సీఎం ని కలిసి తమ సమస్య చెప్పుకునే వెసులుబాటు ఇచ్చింది కాంగ్రెస్.

Read more RELATED
Recommended to you

Latest news