ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నావ్‌…రేవంత్ ఒళ్ళు దగ్గరపెట్టుకో – ఈటల రాజేందర్‌

-

రేవంత్ నోరు, ఒళ్ళు దగ్గరపెట్టుకో….ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు.. ఖబర్దార్ అంటూ వార్నింగ్‌ ఇచ్చారు ఈటల రాజేందర్. వ్యాపారస్తులను బ్లాక్ మెయిల్ చేసి చేస్తున్న వసూళ్ళ చిట్టా రికార్డ్ అవుతుందని తెలిపారు. ఈ మధ్య కాలంలో నడమంత్రపు సిరిలాగా ముఖ్యమంత్రి పదవి వచ్చిన రేవంత్ నెలరోజుల్లోనే రెండు నాల్కలధోరణితో మాట్లాడుతున్నారని ఫైర్‌ అయ్యారు. మోదీగారు మా పెద్దన్న, ఆయన ఆశీర్వాదం ఉంటేనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ది చెందుతుంది అని చెప్పారు.

eetala revanth

ఎన్నో సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న కొంపల్లి, అల్వాల్ ఫ్లై ఓవర్ కోసం 175 ఎకరాల రక్షణ రంగ భూమిని కేటాయించారు అని చెప్పిన సీఎం.. మళ్లీ మోదీ ఎంది అనిమాట్లడుతున్నారని ఆగ్రహించారు ఈటల రాజేందర్. కెసిఆర్ కూడా అలానే మాట్లాడారు. ఆయనకు పట్టిన గతే మీకు పడుతుందని వార్నింగ్‌ ఇచ్చారు. నోరు, ఒళ్ళు దగ్గర పెట్టుకో….అధికారం ఉందని ఎది పడితే అది మాట్లాడితే సహించడానికి ప్రజలు సిద్ధంగా లేరన్నారు. మల్కాజిగిరిలో ఎవరు వచ్చిన ఎన్ని డబ్బులు ఖర్చుపెట్టిన గెలిచేది బీజేపీనే అని ప్రజల ఆశీర్వాదం తమకే ఉంటుంది అని అన్నారు ఈటల రాజేందర్.

Read more RELATED
Recommended to you

Latest news