ఎన్టీఆర్, కేసీఆర్ నాకు నచ్చిన ముఖ్యమంత్రులు : మంత్రి ఎర్రబెల్లి

-

వరంగల్ : నాకు నచ్చిన ముఖ్యమంత్రులు సీనియర్‌ ఎన్టీఆర్, సీఎం కేసీఆర్ అని తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కాంగ్రెస్ వరంగల్ డిక్లరేషన్ రైతులను మభ్యపెట్టేందుకే అని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వారి డిక్లరేషన్ అమలు కావడం లేదని విమర్శలు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి ఉందని పేర్కొన్నారు.

ఏ పంట వేస్తే లాభం జరుగుతుందో ఆలోచించి సాగు చేయాలని.. వరి మినహా ఇతర పంటలు సాగు చేసిన వారు లాభాలు పొందారని ఆగ్రహించారు. ఫామాయిల్ పంట సాగు లాభదాయకం, నేను కూడా 20ఎకరాలు సాగుచేశానని తెలిపారు. రైతు కోఆర్డినేట‌ర్ లకు అధికారులు ఇవ్వాలని కోరారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. మిర్చికి క్వింటాల్ కు 54వేల రూపాయల ధర పలికిందని.. ఎంత వరి వేస్తే 54వేలు వస్తాయన్నారు. అందుకే ప్రభుత్వం చెప్పిన పంటలు వేయాలని.. నూతన విధానాలు అవలంభించాలని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news