దేశానికి పట్టిన క్యాన్సర్.. కాంగ్రెస్ పార్టీ – ఈటల రాజేందర్‌

-

దేశానికి పట్టిన క్యాన్సర్.. కాంగ్రెస్ పార్టీ అంటూ ఫైర్‌ అయ్యారు ఈటల రాజేందర్‌. ఈటల రాజేందర్ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ… ఈటల రాజేందర్ అనే నేను అందరివాడిగా మెలిగా….అన్ని కుల సంఘాలకు అణగారిన వర్గాల వారికి అడుగులో అడుగువేసి నడిచిన. మీరంతా నా కోసం ఈరెండు రోజులు పనిచేయండని కోరారు.

Etala rajendhar

అన్నా మిమ్ముల్ని కాపాడుకుంటేనే మా ఆత్మగౌరవం పెరుగుతుంది అని అనేక సంఘాల వారు అంటున్నారు….కంటోన్మంట్లో కాంగ్రెస్ 2 వేల రూపాయల పంచింది.
అక్రమసంపాదన పంచుతున్నారు. తీసుకోండి. ఓటు మాకు వేయండి అని కోరారు ఈటల.రేవంత్ రెడ్డి బీజేపీని కాన్సర్ తో పోలుస్తున్నారు. మెంటల్ గా ఆర్డర్ తప్పిండా.. సంచలనం కోసం మాట్లాడుతున్నారా ? ఈ చిల్లర మాటలు ప్రజలు సహించలేక పోతున్నారు.

మీ మాటలు అజ్ఞానానికి నిదర్శనం అంటూ ఫైర్‌ అయ్యారు. కాంగ్రెస్ హయాంలో పంజాబ్ జమ్మూ కాశ్మీర్ విధ్వంసం అయ్యింది. నార్త్ ఈస్ట్రెన్ స్టేట్స్ లో అశాంతి నెలకొంది. దేశం విచ్ఛిన్నం అవుతుందా అనేలా ఉండేది. కానీ మోదీ హయాంలో ఇవన్నీ లేవు. ప్రశాంతత నెలకొందన్నారు. గరీబీ హఠావో అని రాహుల్ గాంధీ నానమ్మ ఇందిరా గాంధీ చెప్పారు.. ఈయన కూడా చెప్తున్నారు. పేదరికానికి కారణమే మీరు కాదా ? అని నిలదీశారు. కాంగ్రెస్ హయాంలో చైనా నుండి ముప్పు ఉంటే ఇప్పుడు దుర్భేద్యం అయ్యింది. కాంగ్రెస్ ఏంటో గతంలో రేవంత్ రెడ్డి చెప్పారు. బోఫోర్స్ స్కాం, కోల్ స్కాం, 2 జి స్కాంలమయం. కానీ ఇప్పుడు మోదీ గర్వపడేలా పాలన అందిస్తున్నారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news