షకీల్ కుమారుడి ర్యాష్ డ్రైవింగ్ కేసు.. పంజాగుట్ట సీఐని అదుపులోకి తీసుకున్న పోలీసులు

-

బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు సాహిల్ కారుతో దూసుకెళ్లి ప్రజాభవన్ వద్ద బారికేడ్లు ఢీ కొట్టిన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఈ కేసులో సాహిల్‌ను తప్పించడానికి సాయం చేసిన అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఇటీవలే బోధన్ పోలీసు అధికారిని అరెస్టు చేశారు. ఇక తాజాగా ఈ కేసులో హైదరాబాద్‌ పంజాగుట్ట పూర్వ సీఐ దుర్గారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మాజీ సీఐని అనంతపురం జిల్లా గుంతకల్లు వద్ద పట్టుకున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. రోడ్డుప్రమాదంలో తప్పించిన విధానంపై పశ్చిమ మండలం డీసీపీ కార్యాలయంలో విచారణ చేపట్టిన అనంతరం దుర్గారావును అరెస్ట్‌ చేయనున్నట్లు చెప్పారు. ఇప్పటికే ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టును సీఐ దుర్గారావు ఆశ్రయించిన విషయం తెలిసిందే. వారం నుంచి పరారీలో ఉండగా తాజాగా గుంతకల్లు వద్ద పోలీసులు పక్కా సమాచారంతో పట్టుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఏడుగురిని అరెస్ట్‌ చేయగా దుర్గారావుది ఎనిమిదో అరెస్ట్‌ కానుంది. మాజీ సీఐని A-11 గా పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news