కొత్త ఎమ్మెల్యేలకు ఎలా పాపులర్ కావాలో నేర్పుతా : మాజీ మంత్రి మల్లారెడ్డి

-

కొత్తగా ఎన్నికైన 57 మంది శాసనసభ్యులకు తాను శిక్షణ ఇస్తానని సోషల్ మీడియాలో తనలాగా ఎలా పాపులర్ అవ్వాలో నేర్పుతానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. శనివారం రోజున శాసన సభ లాబీల్లో పలువురు ఎమ్మెల్యేల మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. సభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తొక్కేస్తున్నారని మల్లారెడ్డి అన్నారు.

మల్లారెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ సూపర్ స్టార్ అని సంబోధించారు. అదే సమయంలో అక్కడకు వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డిని మల్లారెడ్డికి కేటీఆర్ పరిచయం చేశారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి నుంచి నేర్చుకోవాలని జైవీర్తో చెప్పారు. దీంతో సామాజిక మాధ్యమాల్లో, మీడియాలో పాపులర్ ఎలా కావాలో కొత్త శాసన సభ్యులందరికీ శిక్షణ ఇస్తానని మల్లారెడ్డి జోక్ చేశారు. దానికి స్పందించిన జైవీర్ రెడ్డి… తాము ఆయన వద్దకు వెళ్తే పాలు, పూలు అమ్మినట్లు తమను కూడా అమ్మేస్తారని సరదాగా వ్యాఖ్యానించారు.

ఇక మాజీ మంత్రి మల్లారెడ్డికి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ముఖ్యంగా పాలమ్మినా.. పూలమ్మినా.. కష్టపడ్డా.. అంటూ ఆయన చెప్పిన డైలాగ్ ఇప్పటికీ ట్రెండ్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news