బీఆర్ఎస్ లో ఏక్ నాథ్ షిండేలు.. మాజీ మంత్రి షబీర్ అలీ సంచలన వ్యాఖ్యలు

-

బీఆర్ఎస్ పార్టీలో ఏక్ నాథ్ షిండేలు ఉన్నారని మాజీ మంత్రి, కాంగ్రెస్ కీలక నేత షబ్బీర్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ లో ఏక్ నాథ్ షిండేలు తయారయ్యారని పార్టీ మూడు ముక్కలు కావడం ఖాయమని అన్నారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుతున్నారని, కాంగ్రెస్ అధికారంలోకి రావడమూ ఖాయమని జోస్యం చెప్పారు.


రాష్ట్రంలో బీజేపీ ఖాళీ అయిందని, ఇక ఆ పార్టీ డిజిట్ కే పరిమితం అవుతుందని తెలిపారు. పార్టీ మారేవళ్లందరూ ఇప్పటికే పార్టీ నుంచి వెళ్లిపోయారని.. ఇక కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్లంతా 24 క్యారెట్ల గోల్డ్ అని ఆయన అన్నారు. నిజామాబాద్ అర్బన్ లో తనకు ఎవరూ పోటీ కాదని.. బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు తన దరి దాపుల్లో కూడా లేరని, అక్కడ కాంగ్రెస్ పార్టీదే విజయమని షబ్బీర్ అన్నారు. కేసీఆర్ మాయ మాటలు నమ్మవద్దని ప్రజలకు సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news