దిల్లీకి వెళ్లిన జగ్గారెడ్డి.. కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చ

-

పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి దిల్లీ వెళ్లారు. మంగళవారం రోజున ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో ఆయన ప్రత్యేకంగా సమావేశమైన విషయం తెలిసిందే. దాదాపు 20 నిమిషాల పాటు ఈ భేటీ జరిగింది. ఈ సమావేశం అనంతరం ఇరువురి భేటీలో చర్చించిన విషయాలను మీడియాకు వెల్లడించడానికి జగ్గారెడ్డి నిరాకరించారు. ఇప్పుడు ఆయన అకస్మాత్తుగా ఈరోజు దిల్లీ వెళ్లారు. ఈ వ్యవహారం అంతా కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది.

అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన జగ్గారెడ్డి ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే ఆయన మరోసారి ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేయనని ఇటీవలే స్పష్టం చేశారు. ప్రస్తుతం తన దృష్టంతా పార్టీ కార్యకలాపాలపైనే ఉందని చెప్పారు. ఈ క్రమంలోనే ఆయన ఎమ్మెల్సీ లేదంటే పీసీసీ అధ్యక్ష పదవి ఆశిస్తున్నట్లు సమాచారం. మరోవైపు మెదక్‌ ఎంపీగా తన కుమార్తె జయారెడ్డి లేదా సతీమణి, సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు నిర్మల పోటీ చేస్తారనే ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఆయన దిల్లీ పర్యటనలో ఈ అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news