వరంగల్ లో గిరిజన మహిళను చితకబాదిన ఎక్సైజ్ సీఐ

-

వరంగల్ జిల్లాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. వరంగల్ లో ఓ గిరిజన మహిళను ఎక్సైజ్ సీఐ రమేష్ చంద్ర విచక్షణారహితంగా చితకబాదాడు. ఈ సంఘటన ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో హాట్‌ టాపిక్‌ గా మారింది. చంద్రజాన్ పాకకి బతుకుదెరువు కోసం వచ్చిన బాధితురాలు తేజావత్ బుజ్జిని.. వ్యక్తిగత పని పై వెళ్తుంటే ఆపి మరి… ఆ గిరిజన మహిళను ఎక్సైజ్ సీఐ రమేష్ చంద్ర విచక్షణారహితంగా చితకబాదాడు.

Excise CI attack on tribal woman

దీంతో తనపై ఎక్సైజ్ సీఐ రమేష్ చంద్ర చేయి చేసుకున్నాడని స్థానిక గీసుకొండ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది బాధితురాలు తేజావత్ బుజ్జి. ఇక ఈ సంఘటన బయటకు రావడంతో..లాంబాడ హక్కుల పోరాట సమితి సీరియస్‌ అయింది. వరంగల్‌లో తేజావత్ బుజ్జి అనే గిరిజన మహిళపై దాడి చేసి విచక్షణారహితంగా కొట్టిన ఎక్సైజ్ సీఐ రమేష్ చంద్రపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. చింతల్ బ్రిడ్జి ఫ్లై ఓవర్ దగ్గర ధర్నాకు దిగింది లాంబాడ హక్కుల పోరాట సమితి.

https://x.com/TeluguScribe/status/1750416645900910895?s=20

Read more RELATED
Recommended to you

Latest news