వచ్చే వేసవిలో విపరీతమైన వేడి – వాతావరణశాఖ ప్రకటన

-

వచ్చే వేసవిలో విపరీతమైన వేడి ఉంటుందని వాతావరణశాఖ ప్రకటన చేసింది. భూమిపైన ఇప్పటివరకు అత్యంత వేడి సంవత్సరంగా నిలిచినటువంటి 2023 లాగానే ఈ ఏడాది వేసవిలోను అత్యంత వేడిగా ఉండనున్నట్టు వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ది ప్రొవిజినల్ స్టేట్ ఆఫ్ ది గ్లోబల్ క్లైమేట్ నివేదికలో ఈ విషయం తేటతెల్లమైంది.

నిరుడు వేసవి లో ఎల్ నినో ప్రభావం మాదిరిగానే ఈ ఏడాది కూడా అవే పరిస్థితిలో అలుముకున్నాయి. దీని ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణ మార్పుల వల్లే సాధారణ ఉష్ణోగ్రతల్లో మార్పులు చోటు చేసు కున్నట్టు తెలిపింది. గ్రీన్ హౌస్ వాయువుల వల్ల ఈ వేసవిలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నదని, వీటి ఫలితంగా సముద్ర మట్టాలు పెరుగుతాయని తెలిపింది. ఈనెల చివరి వారంలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని తెలిపింది. మార్చి 20 తర్వాత అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు వాతావరణశాఖ అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news