వికారాబాద్ లో దొంగ బాబాల హల్చల్… ఆకలి అవుతుందని..?

-

వికారాబాద్ జిల్లాలో దొంగ బాబాలు హల్చల్ చేస్తున్నారు. పరిగి మండలం నస్కల్ గ్రామానికి చెందిన శ్రీకాంత్ ను ఆకలి అవుతుందని భోజనం తినిపించమని అడిగారు దొంగ బాబాలు. అయితే వారికి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో భోజనం పెట్టించిన శ్రీకాంత్ తో నీ చేతికి ఉన్న బంగారు ఉంగరం ఇవ్వు మంత్రం చదివి ఇస్తా నీకు అంతా మంచే జరుగుతుంది అని మాయ మాటలు చెప్పారు.

కానీ బాబా మటలకు లొంగిపోయిన శ్రీకాంత్… చేతికి ఉన్న బంగారు ఉంగరాన్ని తీసి ఇచ్చాడు. ఆ తర్వాత ఓ చెంబు తెప్పించి ఆ చెంబులో ఉంగరాన్ని వేసి మంత్రిచి చెంబు కనబడకుండా తెల్ల బట్ట చుట్టి ఇచ్చిన దొంగ బాబాలు… ఈ చంబుని రేపు ఉదయం తెరవమని చెప్పారు. కానీ అనుమానం వచ్చి వాళ్లు వెళ్తున్న సమయంలో చెంబు తీసి చూడగా అందులో రాయిని చూసి అవ్వక్కై దొంగ బాబాలను పట్టుకున్నాడు శ్రీకాంత్. ఆ తర్వాత గ్రామస్తులను పిలిచి దొంగ బాబాలను పట్టుకుని చితకబాదిన గ్రామస్తులు పోలీసులకు పట్టించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version