జాతకం బాలేదని కూతుర్ని చంపేసిన తండ్రి

-

జాతకరీత్యా తన కూతురు భవిష్యత్తులో కష్టాలు అనుభవిస్తుందని గుడ్డిగా నమ్మాడు ఆ తండ్రి. తన భార్య కూతుర్ని సరిగ్గా చూసుకోదేమోనని.. అలా అయితే తన గారాలపట్టి ఒంటరిగా మిగిలిపోతుందని భావించాడు. ఆ అనుమానంతో ఆ చిట్టితల్లి గొంతుకోసి హతమార్చాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్​లో చోటుచేసుకుంది.

విజయవాడకు చెందిన కుందేటి చంద్రశేఖర్‌(40), హిమబిందు దంపతులకు ఎనిమిదేళ్ల మోక్షజ సంతానం. వీరు ఓ ఐటీ కంపెనీలో పనిచేసేవారు. పనితీరు సరిగా లేదని చంద్రశేఖర్‌ను సంస్థ తొలగించింది. భార్య వల్లే ఉద్యోగం పోయిందని ఆమెపై కక్షగట్టిన చంద్రశేఖర్.. ఇదే విషయమై భార్యతో తరచూ గొడవపడేవాడు. దీంతో భార్య కూతురును తీసుకుని బీహెచ్‌ఈఎల్‌లోని పుట్టింటికి వెళ్లిపోయింది. చంద్రశేఖర్‌ వారంలో రెండుసార్లు వెళ్లి కూతుర్ని చూసేవాడు.

ఈ క్రమంలోనే అతను కుమార్తె జాతకం గురించి తెలుసుకున్నాడు. భవిష్యత్తులో ఆమె కష్టాలు అనుభవిస్తుందని జ్యోతిష్కుడు చెప్పిన మాటలు నమ్మి. కూతురు కష్టపడొద్దని, భార్య ఒంటరిగా మారి నరకం చూడాలన్న ఆలోచనతో మోక్షజను చంపాలనుకున్నాడు. ప్లాన్ ప్రకారం మోక్షజను శుక్రవారం సాయంత్రం తనతోపాటు కారులో తీసుకెళ్లి గొంతు కోసి చంపాడు. ఓఆర్‌ఆర్‌పై తారామతిపేట-కోహెడ మధ్య తిరిగి మృతదేహాన్ని విసిరేద్దామనుకున్నాడు. రాత్రి 10.30 గంటల సమయంలో కారు టైరు పేలి డివైడర్‌ను ఢీకొట్టినప్పుడు ఓ వ్యక్తి వెళ్లి గమనించగా.. చంద్రశేఖర్‌ దుస్తులకు రక్తం మరకలు, చిన్నారి మృతదేహం కనిపించడంతో డయల్‌ 100కు సమాచారం ఇవ్వడంతో ఈ దారుణం బయటపడింది.

Read more RELATED
Recommended to you

Latest news