ఎల్లుండి నుంచే తెలంగాణ ముస్లింలకు ఆర్థిక సాయం

-

తెలంగాణ రాష్ట్ర ముస్లింలకు కేసీఆర్‌ సర్కార్‌ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఎల్లుండి నుంచే తెలంగాణ ముస్లింలకు ఆర్థిక సాయం చేయనుంది కేసీఆర్‌ సర్కార్‌. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 100% సబ్సిడీతో మైనారిటీల కోసం ఆర్థిక సహాయ పథకాన్ని 2023 ఆగస్టు 19న ప్రారంభం కానున్నట్లు తెలంగాణ రాష్ట్ర మైనారిటీల సంక్షేమ శాఖ కార్యదర్శి ప్రకటన చేశారు.

తెలంగాణ స్టేట్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఈ పథకం అమలు చేస్తుందని వివరించారు తెలంగాణ రాష్ట్ర మైనారిటీల సంక్షేమ శాఖ కార్యదర్శి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2023 ఆగస్టు 19న ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాల్లో ఈ పథకం ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news