Telangana : రేపు ఉదయం 10 గంటలకే తొలి ఫలితం

-

Telangana : రేపు ఉదయం 10 గంటలకే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తొలి ఫలితం రిలీజ్‌ కానుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు నవంబర్ 30వ తేదీన ఎన్నికలు జరిగాయి. ఈ పోలింగ్ కు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఆదివారం డిసెంబర్ మూడో తేదీన జరగనుంది.

G-Kishan-Reddy-A-Revanth-Reddy-K-Chandrashekar-Rao

దీనికోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా వికాస్ రాజు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 49 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మూఢంచెల భద్రతను అమలు చేస్తున్నట్లుగా తెలిపారు. 113 నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు 14 టేబుల్ ద్వారా జరుగుతాయని, 500కు పైగా పోలింగ్ కేంద్రాలు ఉన్న ఆరు నియోజకవర్గాల్లో 28 టేబుల్ లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news