భూపాలపల్లి జిల్లా మొరంచపల్లి గ్రామంలో వరద ఉధృతి..భవనాలపై ఎక్కిన జనాలు

-

భూపాల్ పల్లి జిల్లాలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో భూపాల్ పల్లి జిల్లా మొరంచ పల్లి గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. మొరంచ పల్లి గ్రామం చుట్టు ముట్టింది వరద నీరు. ఎగువ ప్రాంతంలో చెరువు తెగిపోవడం వాగులు పొంగిపొర్లడంతో జలదిగ్బంధంలో చిక్కుకుంది మొరంచపల్లి గ్రామం.

ఇక ఇప్పటికే ఈ గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు వాగులో కొట్టుకుపోయారు. 1000 మందికి పైగా ప్రజలు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. సహాయక సహాయక బృందాలు చేరుకోవడానికి ఇబ్బందులు పడుతున్నాయి. మొరంచ గ్రామం చుట్టూ రెండు కిలోమీటర్ల వరకు నీరు చేరిపోయింది. ఇక దీనిపై స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి.. ఆరా తీస్తున్నారు. హెలికాప్టర్‌ ద్వారా సహాయక చర్యలు ప్రారంభించేందుకు యత్నిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news