ఆ భూములు వెనెక్కి తీసుకోవాలి..తెలంగాణ సర్కార్‌ ఆదేశాలు

-

ఇండస్ట్రియల్ భూముల పరిరక్షణ పై ఫోకస్ పెట్టింది తెలంగాణ సర్కార్‌. తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమల విస్తరణ, అభివృద్ధి నేపథ్యంలో టీఎస్ఐఐసి విభాగపు అధికారులతో మంత్రి శ్రీధర్ బాబు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. భూములు పొందిన సంస్థలు వారి ప్రయోజనాలకు కాకుండా థర్డ్ పార్టీలకు లీజుకు ఇచ్చిన అంశాలపై ఆరా తీశారు, అలా థర్డ్ పార్టీలకు జరిగిన లీజు అగ్రిమెంట్లు, పొందుతున్న ఆదాయం అంశాలపై నివేదిక సమర్పించాలని సంస్థ ఉన్నతాధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు మంత్రి శ్రీధర్‌ బాబు.

గతంలో భూములు పొంది, ఈడీ , సిబిఐ లాంటి సంస్థలు జప్తు చేసిన భూములపై హక్కు తిరిగి పొందేలా న్యాయస్థానాల్లో పోరాటం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. జాయింట్ వెంచర్ లో భాగంగా పలు సంస్థలు, కంపెనీలు డివిడెండ్, షేర్ హోల్డ్ అమౌంట్ చెల్లించని అంశాలపై మంత్రి నివేదిక అందించాలని ఆదేశించారు.కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా ఏర్పాటు జరిగిన పలు పారిశ్రామిక పార్కుల ప్రస్తుత పరిస్థితిపై సంస్థ అధికారులు మంత్రికి వివరించారు.టీఎస్ఐఐసి అధికారులు అందరు అందుబాటులో ఉండాలని, చాలా జిల్లాల్లో ప్రజాప్రతినిధులకు అధికారుల అందుబాటు ఉండటం లేదన్న వార్తలు వినిపిస్తున్నాయని, ఎల్లప్పుడు అందుబాటులో ఉండేలా చూసుకోవాల్నయి సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version