టీఆర్‌ఎస్‌ కు షాక్‌..ఇవాళ కాంగ్రెస్ లో చేరనున్న హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే, బడంగ్ పేట్ మేయర్

-

టీఆర్‌ఎస్‌ పార్టీకి బిగ్‌ షాక్‌ తగిలింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు ఉన్నాయి. ఇందులో భాగంగానే.. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క. ఇక ఇవాళ కాంగ్రెస్ లో మహేశ్వరం నియోజవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి, సహా మరో ఇద్దరు కార్పొరేటర్లు చేరనున్నారు.

బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేటర్లు పెద్దబావి సుదర్శన్ రెడ్డి, రాళ్ల గూడెం సంతోష శ్రీనివాస్ రెడ్డితో సహా పలవురు టి.ఆర్ ఎస్ నేతలు కాంగ్రెస్‌ పార్టీ లో చేరనున్నారు. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డిలు కూడా ఇవాళ కాంగ్రెస్‌ లో చేరనున్నారు. టి.పీసీసీ చీఫ్ రేవంత్ నేతృత్వంలో మధ్యాహ్నం 2.30 గంటలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు నేతలు.

Read more RELATED
Recommended to you

Latest news