మాజీ మంత్రి డి.శ్రీనివాస్‌కు తీవ్ర అస్వస్థత

-

మాజీ పిసిసి అధ్యక్షులు, డి శ్రీనివాస్ కు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయన కుటుంబ సభ్యులు… డి శ్రీనివాస్ ను తరలించారు. మాజీ పిసిసి అధ్యక్షులు, డి శ్రీనివాస్ కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గత కొంతకాలంగా ఆయన కిడ్నీ సమస్య మరియు పక్ష వాతంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే.

Former minister D. Srinivas is seriously ill

తన తండ్రి అస్వస్థకు గురైనట్లు ఎంపీ అరవిందు తన సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. ప్రత్యేక వైద్య బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది. ఇది ఇలా ఉండగా అనారోగ్యం కారణంగా డి శ్రీనివాస్ గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి పార్టీలో ఉన్న మాజీ పిసిసి అధ్యక్షులు, డి శ్రీనివాస్ త్వరలోనే కాంగ్రెస్ పార్టీలోకి చేరుతారని గత కొన్ని రోజులుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఆయన ఇప్పటికే బీఆర్‌ ఎస్‌ లోనే ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version