మంత్రి కొండా సురేఖ పై మాజీ మంత్రి సబిత సెన్షేషన్ కామెంట్స్

-

తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్-బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో మంత్రి కొండా సురేఖ పై ట్రోలింగ్స్ జరుగుతున్నాయి. ఈ ట్రోలింగ్స్ పై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. కానీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించలేదని కొండా సురేఖ మీడియాకు వెల్లడించింది. కేటీఆర్ దొంగ ఏడుపులు ఎందుకు..? అక్కా అంటూ కొండా సురేఖ పై వ్యంగ్యంగా స్పందించారు.

దీంతో  కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు కొండా సురేఖ. సమంత-నాగచైతన్య విడిపోవడానికి కేటీఆరే కారణం అని.. ఫోన్ ట్యాపింగ్ చేసి హీరోయిన్ల జీవితాలతో కేటీఆర్ ఆడుకున్నాడని.. డ్రగ్స్ అలవాటు చేశాడని సంచలన ఆరోపణలు చేసింది మంత్రి కొండా సురేఖ. తాజాగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. “మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవడంలో ఉంటుంది. కేటీఆర్  గురించి మీరు మాట్లాడింది ఆక్షేపణీయం. రాజకీయాల్లో వ్యక్తిగత ఆరోపణలు చేయకూడదు, తిరిగి ఆస్కారం ఇవ్వకూడదు. వ్యవస్థలో ఉన్న లోటుపాట్ల గురించి మాట్లాడాలి, సమాజానికి ఆదర్శంగా ఉండాలి. మీరు చేసిన ఆరోపణ వల్ల కేటీఆర్ గారి అమ్మ, భార్య, బిడ్డ, చెల్లి బాధపడరా? వాళ్లు ఆడబిడ్డలు కారా? ఒక తోటి మహిళగా మీరు ఆలోచించినారా? బాధ్యతగల పదవిలో ఉండి బాధ్యతరహితంగా మాట్లాడటం బాధాకరం” అని పేర్కొంది సబితా ఇంద్రారెడ్డి. 

Read more RELATED
Recommended to you

Latest news