కాంగ్రెస్ లో విషాదం.. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

-

కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే మరణించారు. పెద్దపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత బిరుదు రాజమల్లు సోమవారం తెల్లవారుజామున మరణించారు. ఇటీవల గుండ సంబంధిత వ్యాధితో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో బిరుదు రాజమల్లు చేరారు.

Former MLA of Pedpadalli passed away

అయితే సోమవారం రోజున చికిత్స పొందుతూ ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు బిరుదు రాజమల్లు కుటుంబ సభ్యులకు కూడా నిర్ధారణ చేశారు. దీంతో పెద్దపల్లి నియోజకవర్గంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా పని చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు మరణం పట్ల కాంగ్రెస్ నేతలు సంతాపం తెలుపుతున్నారు. ఆయన అంతక్రియలు రేపు జరిగే ఛాన్స్ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news