2 లక్షల మందితో కేసీఆర్ భారీ బహిరంగ సభ

-

తెలంగాణ మొట్ట మొదటి సీఎం కేసీఆర్ మళ్లీ ప్రజల్లోకి రానున్నారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత.. మళ్లీ తొలిసారిగా కేసీఆర్ ప్రజల్లోకి రానున్నారు. నల్లగొండ జిల్లాలో మాజీ సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ ఉండనున్నట్లు బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రకటించింది.

నల్లగొండ జిల్లా కేంద్రంలో ఏదో ఒక నియోజక వర్గంలో మాజీ సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ ఉంటుందట. ఈ నెల మూడో వారంలో కేసీఆర్ సభ ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. 2 లక్షల మందితో ఫిబ్రవరి మూడో వారంలో కేసీఆర్ భారీ బహిరంగ సభ ఉంటుంది.

కృష్ణా జలాలు, కేఆర్ఎంబీ పై వాస్తవాలు ప్రజలకు వివరించడమే టార్గెట్‌గా, కృష్ణా జలాల్లో తెలంగాణ రాష్ట్ర హక్కుల సాధనే లక్ష్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ భారీ సభ నిర్వహించనుంది.నల్లగొండ జిల్లా నుండే KRMB ఇష్యూ పై పోరాటానికి బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఈ భారీ సభపై ఇప్పటికే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.

 

Read more RELATED
Recommended to you

Latest news