కర్నూల్ బోర్డర్‌ కు పట్నం నరేందర్ రెడ్డిని తరలింపు..కేటీఆర్‌ సీరియస్‌ వార్నింగ్‌ !

-

కర్నూల్ బోర్డర్‌ కు పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్‌ చేసి.. తరలించారని కేటీఆర్‌ సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు. రైతుల కోసం సీఎం సొంత నియోజకవర్గం లో మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి చేస్తున్న పాదయాత్ర ను భగ్నం చేశారని కేటీఆర్‌ మండిపడ్డారు. రైతుల కోసం పాదయాత్ర చేస్తున్నారని… నరేందర్ రెడ్డి ని కర్నూలు బార్డర్ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ లో ఉంచారని ఫైర్‌ అయ్యారు.

Former MLA Patnam Narendra Reddy has been arrested by the police ktr reaction

మాజీ ఎమ్మెల్యే తో పాటు, రైతుల ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు కేటీఆర్‌. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి డబ్బులు లేవు అంటున్నారు…. మూసి ప్రక్షాళన కోసం అయితే లక్షన్నర కోట్లు ఉన్నాయా అని ప్రశ్నించారు. అందులో లక్ష కోట్లు తినడానికే అని ఆరోపణలు చేశారు. సమస్యలు ఉంటే కలెక్టర్ ని అడగండి అని సీఎం అంటున్నాడని ఆగ్రహించారు. అధికారులకు ఓట్లు వేయలేదు… కాబట్టి వాళ్ళని ఆడగలేము… నిన్న హర్యానా లో ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి తేలిపోయిందని చురకలు అంటించారు. కర్నాటక, తెలంగాణ లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టి అక్కడ గెలవలేదని సెటైర్లు పేల్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version