దీప్తి కేసులో మరో నలుగురి అరెస్ట్

-

జగిత్యాల జిల్లా కోరుట్లలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి దీప్తి తన ఇంట్లో అనుమానాస్పద మృతి, ఆమె చెల్లెలు అదృశ్యమైన విషయం తెలిసిందే. 22 ఏళ్ల దీప్తి అనే యువతి హైదరాబాద్ లోని మల్టీ నేషనల్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో మంగళవారం జగిత్యాల జిల్లా కోరుట్లలోని తన నివాసంలో దీప్తి అనుమానాస్పదంగా మృతి చెందింది. ఆమె చెల్లెలు చందన మేడ్చల్ లో బీటెక్ చదువుతుంది.

దీప్తి మృతి చెందిన తర్వాత చందన అదృశ్యం అయ్యింది. అయితే ఇంట్లో 30 తులాల బంగారం, రెండు లక్షల నగదు మాయమైనట్లు పేర్కొన్నారు. ఈ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతుంది. తాజాగా ఈ కేసు గురించి జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులో దీప్తి చెల్లెలు చందనతో పాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. చందన బాయ్ ఫ్రెండ్, అతని తల్లి, చెల్లితో పాటు మరొకరిని విచారిస్తున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news