14 నుంచి ‘గాంధీ’ సినిమా ఉచిత ప్రదర్శన

-

14 నుంచి ‘గాంధీ’ సినిమా ఉచిత ప్రదర్శన చేస్తామని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటన చేశారు. భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా ఈనెల 14-24 వరకు తెలంగాణ రాష్ట్రంలో 582 థియేటర్లో ‘గాంధీ’ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించనున్నారు.

అన్ని వర్గాల ప్రజలు వీక్షించేలా ఏర్పాటు చేస్తున్నట్లు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. 15-20 తేదీల్లో చిత్ర ప్రదర్శన ఉండదని చెప్పారు. విద్యార్థుల్లో జాతీయ స్ఫూర్తిని పెంచేలా గతంలోనూ ఉచితంగా షోలు వేసినట్లు మంత్రి వెల్లడించారు. ‘గాంధీ’ సినిమాను అందరూ ఆదరించాలి.. గాంధీ బాటలో ముందుకు సాగాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news