పీసీసీ చీఫ్ గా హై కమాండ్ ఇచ్చిన బాధ్యతను నెరవేర్చా : సీఎం రేవంత్ రెడ్డి

-

పీసీసీ చీఫ్ గా హై కమాండ్ ఇచ్చిన బాధ్యతను నెరవేర్చానని తెలంగాణ  సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మహేష్ కుమార్ బాధ్యతల స్వీకరణ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు రేవంత్ రెడ్డి.  గాంధీ భవన్ లో సోనియాగాంధీ ఆశీర్వాదంతో శాసన మండలి  సభ్యులు అయినటువంటి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే  తెలంగాణ పీసీసీ బాధ్యతలు అప్పగించడం సంతోషకరమన్నారు. సోనియాగాంధీ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని జూన్ 02, 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పదేల్లు కాంగ్రెస్ అధికారంలోకి రాలేకపోయింది.

2014 నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు నానా కష్టాలు ఎదుర్కొని 2023 ఎన్నికల్లో కార్యకర్తలు, నాయకులు కృషితో  విజయం సాధించినట్టు తెలిపారు. ఎన్నో పోరాటల తరువాత స్వరాష్ట్రం వచ్చింది. జులై 07, 2021పీసీసీ చీఫ్ గా హై కమాండ్ ఇచ్చిన బాధ్యతను నెరవేర్చాను అని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. వరంగల్ సభా వేదికగా రైతు రుణమాఫీ హామీ ఇచ్చాం. తుక్కుగూడ వేదికగా ఆరు గ్యారెంటీలు ఇచ్చామని గుర్తు చేశారు. 

Read more RELATED
Recommended to you

Latest news