సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కాబోయే సీఎస్ రామకృష్ణారావు

-

సీఎం రేవంత్ రెడ్డిని హైదరాబాద్ లో రాష్ట్రానికి కాబోయే సీఎస్ కే.రామకృష్ణారావు మర్యాదపూర్వకంగా కలిశారు. రామకృష్ణారావును ప్రభుత్వం సీఎస్ గా నియమించింది. త్వరలోనే ఆయన అధికార బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ ఏడాది ఆగస్టు 4 వరకు ఆయన పదవీలో ఉంటారు. మరోవైపు ప్రస్తుత సీఎస్ శాంతికుమారిని mchrd వైస్ చైర్ పర్సన్ గా నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసింది. ఈ నెల 30న ఆమె పదవీ విరమణ చేయనున్నారు. 

1990 బ్యాచ్ కు చెందిన రామకృష్ణారావు తెలంగాణ  ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఆర్థిక శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వచ్చే ఆగస్టులో ఆయన రిటైర్ కానున్నారు. ప్రస్తుతమున్న ఐఏఎస్‌ల్లో శశాంక్ గోయల్  తరువాత రామకృష్ణారావు సీనియర్‌గా ఉన్నారు. ఆర్థిక శాఖలో ఆయన చేసిన సేవలు, ఆర్థికంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో తనకున్న అనుభవం తోడ్పడుతుందన్న ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ఆయనను నియమించారు. రామకృష్ణారావు గతంలో నల్గొండ జాయింట్ కలెక్టర్‌,  గుంటూరు కలెక్టర్‌ గా  కూడా విధులు నిర్వహించారు.

Read more RELATED
Recommended to you

Latest news