బీసీలకు చేయూత నిరంతర ప్రక్రియ – మంత్రి గంగుల

-

 

వెనుకబడిన వర్గాలలో కుల వృత్తులు,చేతి వృత్తుల వారికి ఒక లక్ష రూపాయల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి గంగుల కమలాకర్. ఈ సందర్బంగా గంగుల మాట్లాడుతూ… బీసీలకు చేయూత నిరంతర ప్రక్రియ అన్నారు. సమైక్య పాలనలో చేతి వృత్తులు ధ్వంసం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. కనుమరుగయినా కులావృత్తులు కాపాడాలనే లక్ష్యం తో సీఎం కేసీఆర్ గారు కులవృత్తులను ఆదుకుంటున్నారని తెలిపారు.

బీసీలకు చేయూత నిరంతర ప్రక్రియ – మంత్రి గంగుల

తెలంగాణ తెచ్చుకున్నదే వెనుకబడిన వర్గాలు ఆర్ధికంగా ఎదగాలని..కరీంనగర్ పద్మనాయక కళ్యాణమంటంలో 686 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు మంత్రి గంగుల. మళ్ళీ ఎన్నికల వస్తున్నాయ్ మళ్ళీ కొంతమంది వస్తున్నారు… వాళ్లకు అధికారం ఇస్తే అంత ఉడుసుకుపోతారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం రాక ముందు నేను ఎమ్మెల్యే గా ఉన్న…. అప్పుడు ఇంత అభివృద్ధి లేదని..కానీ ఇప్పుడు అభివృద్ధి జరుగుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ లో శాంతి భద్రతలు అద్భుతంగా ఉన్నాయని.. కుల వృత్తులను కాపాడేందుకు ఈ పథకం ముఖ్యమంత్రి ప్రకటించారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news